అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా ఉప్పులురువాండ్లపల్లి గ్రామంలో వైయస్ జగన్కు ఘన స్వాగతం లభించింది. 47వ రోజు పాదయాత్ర వసంతపురం గ్రామం నుంచి ప్రారంభం కాగా, అక్కడి నుంచి వైయస్ జగన్ ఉప్పులురువాండ్లపల్లికి రాగానే గ్రామస్తులు ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను జననేతకు వివరించారు.