<br/>తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దాపురం పట్టణంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్దాపురం వాసులు జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్కు వివరిస్తున్నారు. పింఛన్లు రావడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. చిన్నరాజప్ప తప్పుడు హామీలతో మోసపోయామని వాపోతున్నారు. వారందరికీ భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.