<br/>తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు పార్టీ నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనాతవరం గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్కు నియోజకవర్గ ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు.