విశాఖపట్నం: చిరు చినుకుల్లో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. నర్సీపట్నం నుంచి 240వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైయస్ జగన్మోహన్రెడ్డి సుబ్బరాయుడుపాలెం చేరుకుంది. చిరుజల్లులు కురుస్తున్నా.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. వర్షంలోనూ వైయస్ జగన్ను కలుసుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.