296వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


విజయనగరం: ప్రజా కంఠక పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 296వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం వైయస్‌ జగన్‌ సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంచెడు వలస క్రాస్, వెంకటభీరి పురం వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పార్వతిపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్, తమరఖండి వరకు పాదయాత్ర సాగుతుందని తలశీల రఘురాం పేర్కొన్నారు.
 
Back to Top