<strong>విజయనగరంః </strong>వైయస్ జగన్ను కలిసి తోటపల్లి గ్రామ మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామంలో తోటపల్లి ప్రాజెక్టు ఉన్నా..నీటి ఎద్దడి తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 70 శాతం సాగునీరు వస్తుందని తోటపల్లి భావించామని, గ్రామంలోనే రిజ్వరాయర్ ఉన్నా నీరు అందలేని పరిస్థితి ఉందన్నారు.లిప్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలని కోరారు.చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు మొర పెట్టుకుని పట్టించుకోలేదన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారని తెలిపారు.