<strong>విజయనగరంః</strong> ప్రజా సంకల్పయాత్రలో చెరకు రైతులు తమ కష్టాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు రైతులకు సుమారు రూ.13 కోట్లు చెల్లించాలన్నారు. సీజన్లో సకాలంలోనే క్రషింగ్ ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు .చెరకు మద్దతు ధర లేదంటూ రైతులు వాపోయారు. గతంలో వైయస్ఆర్ హయాంలో చెరుకు రైతులను ఆదుకున్నారని గుర్తుచేసుకున్నారు.