<br/>ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రైతు సంఘం నేతలు కలిశారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మనందరి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టు ఏడాదిలో పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకువస్తానని మాట ఇచ్చారు. వైయస్ జగన్ హామీతో వారు హర్షం వ్యక్తం చేశారు.