<br/><strong>విజయనగరంః</strong> పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పారాది వద్ద బొబ్బిలి బార్ అసోసియేషన్ సభ్యులు కలిసిసంఘీభావం తెలిపారు. వైయస్ జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో విశిష్టమైనదన్నారు. మహానేత వైయస్ఆర్ మండువేసవిలో పాదయాత్ర చేశారని, సీఎం అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. వైయస్ జగన్ 3 వేల కి.మీలకు పైగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ ఉన్నారన్నారు. వైయస్ జగన్ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. <br/>