341వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర షెడ్యూల్‌

శ్రీ‌కాకుళం:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చివ‌రి రోజుకు చేరింది. 341వ రోజు పాద‌యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. బుధ‌వారం ఇచ్చాపురం నియోజకవర్గంలోని పెద్ద కొజ్జీరియా నుంచి పాద‌యాత్ర ప్రారంభ‌మ‌వుతుంది.

ఉదయం 11 గంటలకు లొద్దకుట్టి గ్రామం వద్ద వైయ‌స్ జ‌గ‌న్ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి బయలుదేరి 1.15 గంట‌ల‌కు ఇచ్చాపురంలోని పైలాన్ వద్దకు వైయస్ జగన్ చేరుకుంటారు. పాద‌యాత్ర‌కు గుర్తుకు అక్క‌డ ఏర్పాటు చేసిన విజ‌య స్థూపాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి చేరి అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.   

Back to Top