బాబుదంతా మాటల గారడీ

బాబును న‌మ్మేది లేదు
పి.గ‌న్న‌వ‌రం: చ‌ంద్ర‌బాబును న‌మ్మేదీ లేద‌న్న విష‌యం త‌మ‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌యింద‌ని అయిన‌విల్లి మండ‌ల ప‌రిధిలోని శాన‌ప‌ల్లిలంక గ్రామ‌స్తులు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు స్థానికంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌పై మార్కులు వేయించారు. 

ఉపాధి క‌రువు
ముమ్మిడివ‌రం: న‌గ‌ర పంచాయ‌తీలో విలీన‌మైన త‌రువాత మాగ్రామంలో ఉపాధి హామీ ప‌థకం ర‌ద్దు చేసి ఉపాధిలేకుండా చేశార‌ని సోమిదేవ‌రపాలెం ఉపాధి కూలీలు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానిక న‌గ‌ర పంచాయ‌తీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... చంద్ర‌బాబుది మాట‌ల ప్ర‌భుత్వ‌మే త‌ప్ప చేత‌ల ప్ర‌భుత్వం కాద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను కంటికిరెప్ప‌ల చూసేకోవాల్సిన ముఖ్య‌మంత్రి వారి ప్రాణాల‌తో చ‌లగాట‌మాడుతున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 2019లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 

Back to Top