రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం
24 Dec 2016 12:03 PM
వజ్రకరూరు : ప్రజలచేత ఎన్నిౖకెన సర్పంచులను డమ్మీలను చేస్తూ గ్రామసభల నిర్వహణను జన్మభూమి కమిటీలకు అప్పగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఉరవకొండ మండలం వ్యాసాపురంలో గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటన్నింటినీ పక్కనపెట్టి కలెక్టర్ల సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు.
రాజ్యాంగం ద్వారా సర్పంచులకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా కాలరాస్తోందని విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధులు పుష్కలంగా ఉన్నా కూలీలకు పనులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు, ఇ¯ŒSపుట్ సబ్సిడీ మంజూరులో తాత్సారం చేస్తోందన్నారు. టీడీపీ పాలనలో మహిళా సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. కరువు ఉపశమన చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్సార్సీపీ ఉరవకొండ మండల అధ్యక్షుడు వెలిగొండ నరసింహులు, జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.