వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నవరత్నాలతో ప్రజా జీవనం మెరుగు
23 Oct 2017 2:51 PM
తూర్పుగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని పార్టీ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం నడవపల్లిలో పితాని ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ను సీఎం చేసుకుంటే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజా పరిపాలన తిరిగొస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీని గెలిపించి మోసపూరిత చంద్రబాబు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.