వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎన్ని కుట్రలు చేసినా వైయస్ఆర్సీపీ గెలుపు తథ్యం
17 Feb 2017 5:15 PM
–ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా వైయస్ఆర్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి గెలుపు తధ్యమని ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ..అవినీతి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్లా మారుస్తానని మాటలు చెప్పి ఇప్పుడు అవినీతిలో నంబర్గా మార్చారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేసి శాసన మండలి ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని చేసినా వైయస్ఆర్ సీపీ అభ్యర్థి గెలుపును ఆపలేరని వారు హెచ్చరించారు.