వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
21 Mar 2018 11:56 AM
ఢిల్లీ: లోక్సభలో అవిశ్వాస తీర్మానం జరిగేందుకు అన్ని పార్టీల సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవిశ్వాస తీర్మానంపై మరోమారు లోక్సభ సెక్రటరీ జనరల్కు ఆయన నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజా స్వామ్యానికి తూట్లు పొడిచారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మేం పోరాడుతుంటే చంద్రబాబు అణగదొక్కడానికి కుట్రలు చేశారని మండిపడ్డారు. గత మూడు సార్లు సభ ఆర్డర్లో లేదని వాయిదా వేశారని, ఈ రోజైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ నిర్వహించాలని ఆయన కోరారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.