ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ పోరాటాన్ని కొనసాగిస్తునే ఉంది. ప్రత్యేకహోదాపై చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి బుధవారం లోక్సభలో స్పీకర్కు వాయిదా తీర్మానం అందజేశారు. అలాగే పార్లమెంట్లో పార్టీ ఎంపీలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండు చేస్తున్నారు.