వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కాదని, గ్రామస్థాయి టీడీపీ రౌడీలను జన్మభూమి కమిటీల్లో పెట్టడం అన్యాయమన్నారు. కమిటీ సభ్యులు వాళ్లకు సంబంధించిన వారికి మాత్రమే లబ్ది చేకూర్చడం దారుణమన్నారు. <br/>ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మ్మెల్యేలు, నాయకుల గొంతు నొక్కుతోందని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.