వైయస్ఆర్ జిల్లాః ముస్లిం యువకులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలంటూ వైయస్ఆర్జిల్లా ప్రొద్దుటూరులో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్ రెడ్డి ఒక్కరోజు దీక్ష చేపట్టారు.ముస్లింలు పెద్దసంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. ప్రజావ్యతిరేకతను చంద్రబాబు జీర్ణంచుకోలేపోతున్నారని విమర్శించారు.మైనార్టీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు.టీడీపీకి మైనార్టీల పట్ల చిత్తశుద్ధిలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో ముస్లింలకు చంద్రబాబు చేసింది శూన్యమని విమర్శించారు. గుంటూరులో సభపెట్టి ముస్లింలను ఇంకా మోసగించే ప్రయత్నాలు చేస్తే ప్లకార్డులు ప్రదర్శించి ప్రశ్నించిన ముస్లిం యువకులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు.