టీడీపీ దోషుల్ని పెంచిపోషిస్తోంది

చిత్తూరు:  వైయ‌స్ జగన్‌పై కత్తితో దాడి జరగడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దోషుల్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. నిందితులు ఎవరైనా వదిలి పెట్టకూడదని, దీనంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎయిర్‌పోర్టులోకి కత్తులను ఎలా అనుమతిస్తారని, దాడి జరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వైయ‌స్ జగన్‌పై కత్తితో దాడి చేయడం హేయమైన చర్య అని రాజంపేట వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిందితులకు వెంటనే సరైన శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.



Back to Top