మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
10న విశాఖలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
07 Sep 2018 3:06 PM
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ప్రతిపక్షనేత వైయస్ జగన్
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన విశాఖలో జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు ఒరిగిందేమీ లేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సభకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖులు, మేధావులు, ప్రజలు హాజరుకావాలని కోరారు. విశాఖపట్నంలోని సిరిపురం ఏరియాలో మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మీయ సమావేశం ఉంటుందన్నారు. సమావేశం వైయస్ జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని, సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు, అధికారంలోకి వచ్చాక చేయబోయే కార్యక్రమాలను వివరిస్తారన్నారు.