<strong>పబ్లిసిటీలు, ఆర్భాటాలు మానుకో </strong><strong>ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో</strong><strong>చంద్రబాబుపై ధ్వజమెత్తిన శ్రీకాంత్ రెడ్డి</strong><br/>హైదరాబాద్ః రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ దానిని ఆచరణలో పెట్టడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పారిశ్రామిక సమ్మిట్ పెట్టి లక్ష 95 వేల రూ. కోట్లు ఒప్పందాలు జరిగాయని చెప్పుకుంటున్నారు. గతంలోను బాబు తన హయంలో ఆరు సమ్మిట్ లను ఆర్భాటంగా నిర్వహించారు. మీడియా సమావేశాలు పెట్టి లక్షల కోట్లు వస్తున్నాయంటూ హంగామా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ తరవున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గతంలో నిర్వహించిన ఆరు సమ్మిట్ లకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసిందే ధైర్యం ఉందా అని శ్రీకాంత్ రెడ్డి బాబును డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే విధానాలు మానుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. <br/>ఒక్క పవర్ సెక్టార్ లోనే 20 ఒప్పందాలు కుదిరి లక్షా 14 వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దాదాపు 18 వేల మెగవాట్ల విద్యుత్ కు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని డేటా ఇచ్చారు. చైనా పర్యటనలో చైనీస్ కంపెనీతో 10 వేల మెగావాట్లు ఒప్పంద పత్రాలు చేసినట్లు చెప్పారు. దీనిపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. పారిశ్రామికవేత్తలను బతిమిలాడుకునో, బెదిరించో ఫోటోలు దిగడం, పెట్టుబడులు వచ్చాయని పత్రికా ప్రకటనలు చేయడం. ఆతర్వాత దానిని మళ్లీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. <br/>రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పారిశ్రామికవేత్తల కోసం తలుపులు తెరవాల్సిన పనిలేదని, వాళ్లే తలుపులు తోసుకొని వస్తారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడాలన్న హోదాతోనే సాధ్యమని తాము పోరాడుతుంటే హేళన చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి టీడీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా గానీ, ప్యాకేజీ గానీ బిహార్ తరహాలో రాదని నీతి ఆయోగ్ ఛైర్మన్ అరవింద్ జాతీయ పత్రికలో వెల్లడించారు. స్పెషల్ స్టేటస్ పై చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. <br/>చంద్రబాబు గతంలో కుదుర్చుకున్న రిఫైనరీపై అతీగతీ లేదు. చంద్రబాబు తీసుకొచ్చిన అగ్రిగోల్డ్ వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. వాళ్లు పడుతున్న ఇబ్బందులపై చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు. మీడియాలో ఆర్భాట ప్రచారాల కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారు తప్ప చేసిందేమీ లేదని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. ప్రజలను ఇలా ఎంతకాలం మోసగిస్తారని నిలదీశారు. వ్యాపార బృందాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. <br/>కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి పారిశ్రామిక వేత్తలను బెదిరించి రాష్ట్రానికి రానీయకుండా చేసిన చరిత్ర చంద్రబాబుదని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యమంటుూ...చంద్రబాబు టీడీపీ నాయకుల గ్రోత్ రేట్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థికరంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రం ఎంతో ఘన వృద్ధిని సాధించిందని చెప్పారు. <br/>ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. చిత్తశుద్ధితో పనిచేయాలి గానీ పబ్లిసిటీ కోసం కాదని బాబును తూర్పారబట్టారు. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు శ్రీశైలం జలాశయాలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా ఆలోచన చేయడం లేదు. ప్రజల అవసరాలు తీర్చకుండా మభ్యపెడుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆర్భాటాలు మాని ప్రజల కోసం పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి చంద్రబబాబుకు హితవు పలికారు.