అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
టీడీపీ వెన్నులో ‘ఐటీ’ వణుకు
06 Oct 2018 3:59 PM
నెల్లూరు: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతలంతా ఐటీదాడులంటేనే బెంబేలెత్తిపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ అన్నారు. అవినీతి, అక్రమంగా అర్జించిన సొమ్ము బయటకు వస్తుందని భయపడుతున్నారన్నారు. నెల్లూరులో అనిల్కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులు పోలీసు రక్షణ ఇవ్వాలని చెప్పడం చూస్తూ టీడీపీ నాయకులు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుందన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలను నడిరోడ్డున పడేసి ఇష్టారీతిగా దోపిడీ చేశారని, ఆ దోపిడీ సొమ్మునంతా అధికారులు కక్కించాలని కోరారు. పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు విచ్చలవిడిగా రాష్ట్ర వనరులను దోచుకుతిన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం దొంగ ముఠాకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.