మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల దోపిడీ
21 Aug 2018 1:16 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడ: రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల దోపిడీకి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికవనరుగా చంద్రబాబు మార్చుకొని దోచుకుంటున్నారని విమర్శించారు. తన వర్గం విచ్చలవిడిగా దోచుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రంలో అనేక నిర్మాణాలు చేస్తామని కేంద్రం హామీ ఇస్తే..ఆ చట్టాన్ని కూడా అమలు చేయించుకోలేని బలహీన ముఖ్యమంత్రి, చేతకాని వ్యక్తి చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత ఆస్తులు, కుటుంబ ఆస్తులను పెంచుకోవడానికి ఏపీని చంద్రబాబు ఒక వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మిస్తే తనకు ముడుపులు రావని, వేల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని విమర్శించారు.