తిరుపతి: నాలుగేళ్లలో టీడీపీ ప్రజలకు చేసిందేమిటని వైయస్ఆర్సీపీ నేత పార్థసారధి ప్రశ్నించారు. ఈ రోజు వెంకటేశ్వరస్వామిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుతాడా అని నిలదీశారు. చంద్రబాబును పొగిడించుకునేందుకు మహానాడు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు.