కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఊరించి ఉసురు తీయడమే బాబు నైజం
26 Nov 2018 1:45 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి
శ్రీకాకుళం: చంద్రబాబు నిరుద్యోగ యువతను ఊరించి ఉసురు తీస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఎన్నికలు దగ్గరపడ్డాయని డీఎస్సీ పేరుతో మారోమారు మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భూమన కరుణాకర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మళ్లీ మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో 26 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 7 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేయడమంటే ఊరించి ఉసురు తీయడమేనన్నారు. నాలుగేళ్లు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అరకొరగా భర్తీ చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతిలో యువతను మోసం చేసినట్లే ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థులను మోసం చేస్తాడన్నారు. చంద్రబాబు నక్కజిత్తులు నమ్మి యువత మోసపోవద్దన్నారు.