బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రూ.6500 కోట్ల ఇన్ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు
22 Mar 2017 11:24 AM
ఏపీ అసెంబ్లీ: రైతులకు అందాల్సిన రూ.8 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి గాను రూ.6500 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అకాల వర్షాలు, కరువు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చంద్రబాబు ఆ సమయంలో ఇచ్చిన మాటను మరిచిపోయారని ధ్వజమెత్తారు. లైలా తుపాన్, హుద్హుద్ సైక్లోన్, కరువు, భారీ వర్షాలు, 2015 ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలు, కరువు, మేలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బంతిన్నాయి. మూడేళ్లకు కలిసి రూ.8 వేల కోట్లకు గాను కేవలం 1546 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాదాపు రూ.6444 కోట్లు ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు. మీరు ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇవ్వాలని మేం కోరితే..ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన వాటిని గుర్తు చేసుకోవడం సరికాదు. తుపాన్లు, అకాల వర్షాల సమయంలో మీరు హామీ ఇచ్చిన విషయాలను, కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అసత్యాలు మాట్లాడం దారుణమన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఎనిమిదేళ్లు అవుతుంది, ఆయన పాలన గురించి ఏం మాట్లాడుతారు. మీరు ఏం చేశారో చెప్పండి అని నిలదీశారు.