<br/><br/>ఒంగోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోలీవేడుకల్లో పాల్గొన్నారు. చీమకుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించిన జననేత అక్కడ జరిగిన హోలీవేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రంగులు పూసి హోలీ వేడుకల్ని సంతోషంగా జరుపుకొన్నారు.