కేరళ వరదలు హృదయాన్ని కలచివేస్తున్నాయి



విశాఖ:  కేరళ వరదలు హృదయాన్ని కలచివేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేరళను వరదలు ముంచివేయడంతో ఈ మేరకు వైయస్‌ జగన్‌ ట్వీట్టర్‌లో స్పందించారు. ఈ కష్టకాలంలో నా ఆలోచనలు, ప్రార్థనలు కేరళ ప్రజలతో ఉన్నాయని సందేశం పంపారు. ఈ విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పునరావాస సహాయం కల్పించాలని విజ్ఞాప్తి చేశారు. 
 
Back to Top