‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
రాక్షస పాలనకు 5వేల మంది బలి
19 Apr 2017 5:10 PM
- కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నట్టేట ముంచిన చంద్రబాబు
- మ్యానిఫెస్టోలో అంశాలను నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి
- రుణాలు మాఫీ చేస్తానని ఉద్యోగాలను మాఫీ చేస్తున్న బాబు
- బాబు మూడేళ్ల పాలనలో 5 వేల మంది యువత ఆత్మహత్య
- దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దూ, పోరాటం చేసి సాధించుకుందాం
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రతీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ ఇళ్లనే నాశనం చేసే వ్యక్తిగా తయారయ్యాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వెల్లంపల్లి మండిపడ్డారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను టీడీపీ సర్కార్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మంత్రివర్గ ఉపసంఘం కుండబద్ధలు కొట్టినట్లుగా వారిని రెగ్యులరైజ్ చేసిదిలేదని తేల్చిచెప్పిందన్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చాక వారి గొంతు కోసే విధంగా వ్యవహరించిందన్నారు. మూడు సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేస్తామని వారికి ఆశకల్పించి చివరకు ఉద్యోగులను నట్టేట ముంచారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబుది రెండు నాలుకల ధోరణి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజమండ్రిలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయడం లేదని వెల్లంపల్లి ప్రశ్నించారు. టీడీపీ మ్యానిఫెస్టో 30వ పేజీలో ఐకేపీ, ఎన్ఆర్ఐజీఎస్, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య, విద్యుత్ ఇలా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని క్లియర్గా ఉందని వివరించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా రెండు నాలుకల ధోరణిలో చంద్రబాబు వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఉద్యోగాలు మాఫీ చేస్తున్నారని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. విశాఖ జోన్–1 పరిధిలో 18 మంది అంగన్వాడీ సూపర్ వైజర్లను, రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఆదర్శ రైతులను, ఉపాధి క్షేత్రస్థాయి సహాయకులను 15 వేల మందిని, గృహ నిర్మాణ శాఖలో 3,600 మందిని, వైద్య, ఆరోగ్యశాఖలో 4 వేల మందిని, ఇరిగేషన్ శాఖలో 7 వేల మందిని, విద్యుత్ శాఖలో 1998 నుంచి పరిచేస్తున్న 21,800 మంది కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు.
బాబువస్తే ఆటోమెటిక్గా కరువొస్తుంది
రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో విఫలమైన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారని వెల్లంపల్లి విమర్శించారు. లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారు.. రాష్ట్ర యువతనేమో గాలికొదిలేశారు. ఇది న్యాయమా చంద్రబాబు అని నిలదీశారు. ఉద్యోగం కల్పించకపోతే ప్రతి ఒక్కరికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. మూడేళ్లయినా అది అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కరువు ఆటోమెటిక్గా వస్తుందని గత 9 ఏళ్ల పాలనే కంటిన్యూ అవుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 27.23 లక్షల నిరుద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. ఉద్యోగాలు రాక ప్రతీఏటా 350 నుంచి 400 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో దాదాపు 5 వేల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు రాక్షసపాలనకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. విశాఖపట్నం రైల్వేజోన్ కోసం ప్రసాద్ అనే వ్యక్తి ప్రభుత్వానికి లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇవన్నీ చంద్రబాబుకు కనిపించడం లేదా అని నిలదీశారు. దీన్ని ప్రభుత్వ హత్య కింద భావించాలన్నారు. ఉద్యోగాల కోసం, రాష్ట్ర హక్కుల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ప్రజాపోరాటం చేసి సాధించుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు, నిరుద్యోగులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.