విశాఖపట్నంః విశాఖ కళావాణి ఆడిటోరియంలో విద్యార్థి యువభేరి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈకార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు, యువతకు ప్రత్యేకహోదా ప్రాముఖ్యత గురించి దిశానిర్దేశం చేయనున్నారు. విద్యార్థి యువభేరికి రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా విద్యార్థులు పెద్ద ఎత్తున యువభేరికి తరలివచ్చారు.<br/> యువభేరిని అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పి ప్రభుత్వం అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు మద్దతు తెలిపేందుకు విద్యార్థులు కళావాణి ఆడిటోరియంకు పోటెత్తారు.