రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
గడువులోపు ప్రకటన చేయకపోతే దీక్ష తప్పదు...!
21 Sep 2015 1:18 PM
విశాఖపట్నంః ఈనెల 25లోగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకహోదాపై ప్రకటన చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ప్రత్యేకహోదాను పట్టించుకోవడం లేదని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి ఆరోపించారు.
ప్రత్యేకహోదా విషయాన్నినీతి ఆయోగ్ కు అప్పగించామన్న కేంద్రం, నెలరోజులైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడంతోనే తమ ప్రస్థానం మొదలవుతుందన్నారు.