మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన విజయమ్మ
23 Sep 2013 7:52 PM
హైదరాబాద్ 23 సెప్టెంబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిన ఈరోజే పండుగ రోజని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, శ్రీ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి అయిన శ్రీమతి వైయస్ విజయమ్మ ఆనందాన్ని వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసంలో సోమవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు అండగా నిలిచిన ప్రజలందరికీ శ్రీమతి విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలు శ్రీ జగన్మోహన్ రెడ్డికి కావాలని కోరారు. దేవుడు గొప్ప దేవుడని, 16 నెలల నుంచి జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలొచ్చిందనీ ఆమె చెప్పారు. దేశవిదేశాలలోని ఆయనకోసం ప్రజలంతా చేసిన ప్రార్థనలు ఫలించాయన్నారు. జగన్ బాబు బెయిల్పై బయటకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి పోరాడినట్లు చెప్పారు.