రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ముగిసిన 205వ రోజు మరో ప్రజాప్రస్థానం
10 Jul 2013 8:16 PM
వెన్ను (విజయనగరం జిల్లా),
10 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర 205వ రోజు బుధవారం షెడ్యూల్ విజయనగరం జిల్లా వెన్ను వద్ద ముగిసింది. బుధవారం ఉదయం లొట్టలపల్లి వద్ద పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల 14 కిలోమీటర్లు నడిచారు. 205వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల మొత్తం 2,732.4 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు.
వర్షంలోనూ పాదయాత్ర కొనసాగించిన షర్మిల :
కాగా శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయనగరం జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర సోమరాజుపాలెం చేరుకునేసరికి భారీగా వర్షం కురిసింది. భారీ వర్షం పడుతున్నా ఆమె తన పాదయాత్రను యధావిధిగా కొనసాగించారు.