చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
'సిఎం కిరణ్ అవినీతి ఎంతో వారే చెప్పాలి'
14 Apr 2013 10:28 AM
రాయచోటి : మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అండదండలతో పదవులు పొంది, ఆయన కుటుంబం తప్పితే రాష్ట్రానికి మరో దిక్కులేదని చెప్పిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు ఇప్పుడు అదే కుటుంబంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో గడికోట శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు కష్టపడి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చిన వైయస్ఆర్ ఒక దినపత్రిక, చానల్ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, కేవలం రెండేళ్లలోనే రెండు టి.వి. చానళ్లు, ఒక పత్రికను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి ఇంకెంత అవినీతికి పాల్పడ్డారో వెల్లడించాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష నాయకులపై ఉందని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.