వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
షర్మిల నేటి మరో ప్రజాప్రస్థానం షెడ్యూల్ ఇదీ..
18 Feb 2013 8:13 AM
నల్గొండ, 18 ఫిబ్రవరి 2013: అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, స్వార్థం కోసం దానికి వత్తాసుగా నిలుస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్గొండజిల్లా మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో కొనసాగుతుంది. ప్రజల కష్టసుఖాల్లో తామున్నామంటూ భరోసా ఇస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు.
సోమవారం ఉదయం మిర్యాలగూడ మండలంలోని ఈదులగూడెం నుంచి శ్రీమతి షర్మిల 70వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గూడూరు, కృష్ణాపురం, కొత్తగూడెం మీదుగా దామరచర్ల మండలంలోని కొండ్రపోలు, కొండ్రపోలు కాల్వ, రాళ్లవాగు తండా, బొత్తలపాలెం చేరుకుంటుంది. బొత్తలపాలెం శివారులో ఏర్పాటు చేసిన గుడారంలో శ్రీమతి షర్మిల ఈ రాత్రికి బస చేస్తారు.