నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
వైయస్ఆర్సీపీ పోరాట ఫలితమే జీతాల పెంపు
06 Apr 2017 6:34 PM
చిత్తూరు(గంగాధరనెల్లూరు): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా జైన్ఫామ్ ప్రెష్ కర్మాగారం కార్మికులకు వేతనాలు పెరిగాయని ఆ సంఘం అధ్యక్షుడు కలిజవేడు సుబ్రమణ్యంరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మండలంలోని జైన్ఫామ్ప్రెష్ కర్మాగారంలో పని చేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కొక్క ఉద్యోగికి రూ.4250 జీతం పెరిగిందన్నారు. రాజంపేట ఎంపి మిధున్రెడ్డి, వైయస్ ఆర్ టీయూసీ గౌరవాధ్యక్షులు బీరేంద్రవర్మ, యూనియన్ సలహాదారుడు చిన్నమరెడ్డి కృషితో జైన్ యాజమాన్యంతో సంప్రతింపులు జరిపామన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం జీతం పెంపునకు అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దుర్గాపతినాయుడు, రవిబాబు, విజయసారధి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి, జీతాల పెంపుకు కృషి చేసిన వైయస్ఆర్టీయూసీ నాయకులకు కృతజ్ఙతలు తెలిపారు.