నెల్లూరు, 15 సెప్టెంబర్ 2012: నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. పార్టీ స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.మంచినీరు , నగరంలో పేరుకుపోతున్న చెత్త , లోపించిన పరిశుభ్రతపై స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగునీరు నిలిచిపోయి దోమల బెడద తీవ్రంగా ఉందని, నగర వాసులు ఎంపీ దగ్గర మొరపెట్టుకున్నారు. మునిసిపల్ కమిషనర్తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని నగర ప్రజలకు మేకపాటి హామీ ఇచ్చారు.