విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న నారాయణ

విజయవాడ: పేపర్‌ లీక్‌లు చేసుకుంటే లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న మంత్రి నారాయణను రాజీనామా చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేవారు.  డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నారాయణ హై స్కూల్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయ్యిందని స్పష్టంగా చెప్పిందని ఆధారాలతో సహా మీడియాకు చూపించారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు సాక్షి మీడియా ముద్రించిన పేపర్‌ కాదని స్పష్టం చేశారు. సభలో లీకేజీలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్య కాదని ప్రభుత్వం మొండివాదన చేస్తోందని దుయ్యబట్టారు. కొన్ని లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తు మీకు ప్రజా సమస్యగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్ని చిన్న ఉద్యోగులు సూపర్‌డెంట్, ఇన్విజిలేటర్‌లను సస్పెండ్‌ చేసి తూతూ మంత్రంగా విచారణ జరిపిస్తున్నారని ధ్వజమెత్తారు. కదిరి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరులో పేపర్‌ లీక్‌ల వెనుక మంత్రి నారాయణ ఉన్నారని ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థల్లో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా మంత్రిని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. వియ్యంకుడే విద్యాశాఖమంత్రి కాబట్టి విద్యాసంస్థలను అడ్డుపెట్టుకొని ఫీజు దోపిడీలు చేస్తున్నా.. ప్రభుత్వం నారాయణ పాటే పాడుతోందని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న నారాయణ యాజమాన్యంపై యాక్షన్‌ తీసుకోవాలని, అదే విధంగా మంత్రి నారాయణను రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు.

Back to Top