ఢిల్లీ: కేంద్రంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే కోరుతున్నామన్నారు. పార్లమెంట్ ఔనత్యాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలన్నారు.