నగరి: గాలేరు–నగరి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పాదయాత్ర చేపట్టారు. నగరి నుంచి తిరుమల వరకు నాలుగు రోజుల పాటు ఎమ్మెల్యే రోజా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డిలు సంఘీభావం తెలిపారు.