మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
బాబుకు ఎమ్మెల్యేలను కొనడంపైనే శ్రద్ధ
05 Mar 2018 1:12 PM
ఢిల్లీ: రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదాను కోరుకుంటుంటే.. చంద్రబాబు మొదలు టీడీపీ నేతలంతా కమీషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీ కోరుకుంటున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ అనేక పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో అన్ని జిల్లాల్లో యువభేరీలు నిర్వహించి యువతను చైతన్య పరిచారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలను కొనడంలో ఉన్నంత శ్రద్ధ.. ప్రత్యేక హోదా సాధించడంలో లేదన్నారు. చదువుకున్న యువత ఉద్యోగాలు చేసేందుకు బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదే హోదా వస్తే పరిశ్రమలు వచ్చి స్థానికంగా ఉండే యువతకే ఉద్యోగాలు దొరకుతాయన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా ఇంకా సంవత్సరం ఓపిక పడితే వైయస్ జగన్ సీఎం అవుతారని, ప్రజల కష్టాలన్నీ తారుతాయన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన మళ్లీ చూడాలంటే వైయస్ జగన్ను సీఎంను చేసుకోవాలన్నారు.