అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఎన్నికల ఎత్తులు.. చంద్రబాబు నక్కజిత్తులు
26 Jun 2018 3:16 PM
బీజేపీతో చీకటి ఒప్పందాలు.. కాంగ్రెస్తో జతకట్టేందుకు యోచన
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు: బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. కర్నూలు జిల్లా నందికోడ్కూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జలయజ్ఞం ప్రవేశపెట్టి సాగు, తాగునీరు అందించిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనత వైయస్ఆర్దని, ఆ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు అవినీతి సొమ్ముతో గెలవాలని కుట్రలు చేస్తున్నాడని, ఓటుకు రూ. 5 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు అవినీతిపై విచారణ ఎదుర్కోక తప్పదన్నారు.