ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
ముసుగు తొలగించరా
06 Apr 2017 5:54 PM
బనగానపల్లె రూరల్ః రాష్ట్రంలో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన కూడా అధికారులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ విగ్రహానికి వేసిన ముసుగును తొలగించకపోవడంతో వైయస్సార్ అభిమానులు, ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మండలం లోని యనకండ్ల గ్రామంలో బస్టాండ్సర్కిల్లో ఏర్పాటు చేసిన, డాక్టర్ వైయస్సార్ విగ్రహానికి గత నెలలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రెవెన్యూ అధికారులు విగ్రహానికి ముసుగువేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసి సుమారు 16 రోజులు పూర్తయింది. అయితే వైయస్సార్ విగ్రహానికి వేసిన ముసుగు రెవెన్యూ అధికారులు తొలగించక పోవడంతో పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ గ్రామం ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతోనే వైయస్సార్ విగ్రహానికి వేసిన ముసుగును తీయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.