మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
'మళ్ళీ బహిర్గతమైన టిడిపి నీతిమాలిన చర్య'
08 Dec 2012 1:37 PM
విజయనగరం, 8 డిసెంబర్ 2012: ఎఫ్డిఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు టిడిపికి చెందిన ముగ్గురు సభ్యులు గైర్హాజరవడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుజయ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. ఈ బిల్లుపై టిడిపి అనుసరించిన నీతిమాలిన చర్యపై వారంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఎఫ్డిఐలను వ్యతిరేకించాలనుకుంటే చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీల చేత ఆ విధంగా ఓటు వేయించాలని, ఢిల్లీలోనే ఉండి ఓటింగ్ సమయంలో గైర్హాజరవడమేమిటని రంగారావు ప్రశ్నించారు. శనివారంనాడు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. టిడిపి ఎంపీల ద్వంద్వ వైఖరి తేటతెల్లం అయిందని విమర్శించారు.