<strong>అనంతపురం, 1 మే 2013: </strong>రాష్ట్రంలోని కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఓ స్వర్ణయుగమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి. గుర్నాథరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో బుధవారం జరిగిన మేడే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన కార్మికులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.