సానుభూతిపరులకే సంక్షేమ పథకాలు

శ్రీకాకుళంః  ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు బహిష్కరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎల్‌ఎన్‌పేట మండలం కొమ్మువలస గ్రామస్తులు జన్మభూమి కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. అర్హులకు గాకుండా అనర్హులకు, టీడీపీ సానుభూతి పరులకే సంక్షేమ పథకాలు అందిస్తుండటంతో గ్రామస్తులంతా కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి కార్యక్రమం వట్టి మోసపూరిత కార్యక్రమమని గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు.  పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రామస్తులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Back to Top