మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రజాస్వామ్య విలువలు ఖూనీ
05 Apr 2017 6:26 PM
ఆలూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నాడని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆరోపించారు. బుధవారం ఆయన స్వగ్రామమైన గుమ్మనూరులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపుదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచిన వారు మరోపార్టీలో చేరేముందు వారి పదవులకు రాజీనామా చేయించాలన్నారు. అలా చేయకుడా చంద్రబాబు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాడని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేఖంగా వైయస్ఆర్ సీపీ కేంద్రకమిటీ పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా మండలాల పార్టీ కన్వినర్లు, ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.