సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజల ఆకాంక్ష
20 Dec 2012 12:17 PM
గుంటూరు సెంట్రల్ (గుంటూరు జిల్లా):
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలను జననేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని పార్టీ నాయకుడు ఏటిగడ్డ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడులోని కరణంగారి వీధిలో శ్రీ లక్ష్మీగణపతి హోమాన్ని నిర్వహించారు. నవులూరి సాయిబాబుదీక్షితులు ఆధ్వర్యంలో ఈ హోమాన్ని ఏటిగడ్డ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అధికార కాంగ్రె స్, విపక్ష టీడీపీలను ప్రజలు నమ్మేపరిస్థితిల్లో లేరన్నారని సుచరిత అన్నారు.