<strong>గన్నవరం: </strong>నాడు బాబు వస్తే జాబు వస్తుందన్నారు..ఏ ఒక్కరికి జాబు రాలేదని దుట్టా రామచంద్రారావు విమర్శించారు. జాబు రావాలంటే జగనన్న రావాలన్నారు. పనికి మాలిన దేవినేని ఉమా ఒక్కసారైనా పోలవరం గురించి ఆలోచించాడా అని ప్రశ్నించారు. పోలవరం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మాత్రమే అన్నారు. పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాలా? మనల్ని మనం పరిపాలించుకోవాలంటే జగనన్న రావాలి అని పేర్కొన్నారు