రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఇది ముమ్మాటికీ జగన్పై కక్ష సాధింపే
02 Jan 2013 10:02 AM
కూడేరు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని పార్టీ సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, కిసాన్ సెల్, అనంతపురం జిల్లాల సమన్వయకర్త వై. మధుసూదన్రెడ్డి విమర్శించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు, సీబీఐ పక్షపాత ధోరణిని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణను కూడేరులో మంగళవారం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మహిళలు, వృద్ధులు, వికలాంగులు సైతం స్వచ్ఛందంగా తరలి వచ్చి సంతకాలు చేశారు. జననేత బయటకొచ్చి ఓదార్పు యాత్ర కొనసాగిస్తే తమకు పుట్టగతులుండవని కాంగ్రెస్, టీడీపీ భయపడుతున్నాయని చెప్పారు. అందువల్లే ఆయనకు బెయిల్ రాకుండా సీబీఐని అడ్డుపెట్టుకుని అనేక కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. శ్రీ జగన్పై ప్రజలకు విపరీతమైన అభిమానం ఉందన్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా జననేత రాజకీయ ఎదుగుదలను అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.